Tuesday, March 26, 2024

గుంటూరు జిల్లాలో టీడీపీకి షాక్.. మాజీ మంత్రి రాజీనామా

ఏపీలో టీడీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఓవైపు రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగిన ఓటమి పలకరిస్తుండగా..మరోవైపు కీలక నేతలంతా రాజీనామా చేస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీకి షాక్ తగిలింది. మాజీ మంత్రి, ఆప్కో చైర్మన్ మురుగుడు హనుమంతరావు పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వటం లేదని.. పార్టీ తన సేవలు ఉపయోగించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది నుంచి టీడీపీకి దూరంగా ఉంటున్నానని.. ఏ పార్టీలోకి వెళ్ళేది కార్యకర్తలు, అభిమానులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానన్నారు. టీడీపీ హయాంలో ఆప్కోకి ఎటువంటి ప్రయోజనం కలగలేదని.. ప్రస్తుతం మన మంగళగిరి నియోజకవర్గంలో అభివృద్ధి బాగా జరుగుతుందన్నారు.

కాగా, గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గానికి చెందిన మురుగుడు హనుమంతరావు 1999, 2004లో మంగళగిరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మంత్రిగా కూడా పని చేశారు. అనంతరం ఆయన టీడీపీలో చేరారు.

ఇది కూడా చదవండి: పసిడి ప్రియులకు షాక్.. నేటి బంగారం ధర ఇది!

Advertisement

తాజా వార్తలు

Advertisement