Thursday, April 18, 2024

టీడీపీ నేతల ముందస్తు అరెస్ట్.. బయటకి రాకుండా గృహానిర్బంధం

అక్రమ మైనింగ్ ఫిర్యాదులపై కొండపల్లి అటవీ ప్రాంతంలో పరిశీలన చేయనున్న టీడీపీ నిజనిర్థారణ కమిటీ సభ్యులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. శనివారం ఉదయం 10 గంటలకు టీడీపీ నిజనిర్ధారణ కమిటీ సభ్యులు కొండపల్లి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే గృహనిర్భందం చేస్తున్నారు. మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు, పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమలను పోలీసులు గృహానిర్బంధం చేశారు. ఇంటికి వచ్చి గృహ నిర్భంధంలో ఉండాలని నిజనిర్ధారణ కమిటీ సభ్యులకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. విజయవాడలో మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ, గుంటూరులో మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు సహా పలువురు నేతలకు నోటీసులు ఇచ్చారు. ఇంటి బయటకు రాకుండా తలుపులకు పోలీసులు నోటీసులు అంటించారు. వ్యక్తిగత పని మీద బయటకు వెళ్లేందుకు బయలుదేరిన ఆనంద్ బాబును.. పోలీసులు గుంటూరులోని ఆయన నివాసం వద్ద అడ్డుకుని ఇంటికి తలుపులు వేశారు. పోలీసులు తీరుపై ఆనంద బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఇది కూడా చదవండి:

Advertisement

తాజా వార్తలు

Advertisement