Saturday, April 20, 2024

బయటి వ్యక్తులు ఓటేశారు..రీపోలింగ్ జరపాల్సిందే: పనబాక లక్ష్మి

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. అయితే ఎన్నికల్లో దొంగ ఓట్లు పడ్డాయి అంటూ ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నారు దేనికి వైసీపీ కూడా కౌంటర్లు వేస్తూ వస్తోంది. అయితే ఈ వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. తాజాగా టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో బయటి వ్యక్తులు ఓట్లేశారని, తిరుపతి, ఓజిలి ప్రాంతాల్లో రీపోలింగ్ జరపాలని డిమాండ్ చేశారు. నేటి పోలింగ్ లో స్కూలుకు వెళ్లే పిల్లలు కూడా ఓటేయడం ఈ ఎన్నికల ప్రత్యేకత అని వ్యంగ్యం ప్రదర్శించారు. కుటీర పరిశ్రమ తరహాలో నకిలీ ఓటరు కార్డులు తయారు చేశారని వ్యాఖ్యానించారు. కోట ప్రాంతంలోనూ అక్రమాలు జరిగాయని ఆరోపించారు. బోగస్ ఓటర్లను నిరోధించేందుకు ప్రయత్నించిన తమ ఏజెంట్లపై కేసులు నమోదు చేశారని పనబాక లక్ష్మి వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement