Thursday, April 25, 2024

Breaking: ఏపీలో క్యాసినో రాజకీయం.. మంత్రి కొడాలికి బుద్ధా వెంకన్న సవాల్

ఏపీలో రాజకీయం మళ్లీ వేడెక్కింది. వైసీపీ, టీడీపీ నేతల మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లు కొనసాగుతున్నాయి. మంత్రి కొడాలి నానిని భర్తరఫ్ చేయాలని టీడీపీ డిమాండ్ చేసింది. టీడీపీ నిజనిర్ధారణ కమిటీ రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ ని సాయంత్రం కలిసేందుకు అపాయింట్ మెంట్ కోరారు. క్యాసినోపై డీజీపీకి ఫిర్యాదు చేయన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కొడాలి నానిపై టీడీపీ నేత బుద్ధావెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే చంద్రబాబు ఇంటి గేటును తాకి చూడు అంటూ సవాల్ విసిరారు. నువ్వు పెట్రోల్ పోసుకుని తగలబెట్టుకోవడం కాదు ప్రభుత్వం పడిపోతే అరగంటలో ప్రజలే నీ సంగతి చూస్తారని హెచ్చరించారు. దమ్ముంటే పోలీసులు లేకుండా రా తేల్చుకుందాం అంటూ సవాల్ విసిరారు. కొడాలి నాని భాష ఏంటి? నీ చరిత్ర ఏంటి? అని ప్రశ్నించారు. గుడివాడలో ఆయిల్ దొంగవి అని ఆరోపించారు. వర్ల రామయ్య పోలీసులు అధికారిగా ఉన్నప్పుడు లాకప్ లో వేసి కుమ్మాడని పేర్కొన్నారు. ఆడు.. ఈడు అనడానికి నీ బావమరుదులమనుకుంటున్నావా? అంటూ ఫైర్ అయ్యారు. నీలాంటి వ్యక్తులకు టికెట్ ఇవ్వడమే చంద్రబాబు పొరబాటు అని అన్నారు.  క్యాసినోవాలో రూ.250 కోట్లు చేతులు మారాయని ఆరోపించారు. అందులో డీజీపీ నీ వాటా ఎంత ? అని బుద్ధా వెంకన్న ప్రశ్నించారు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement