Thursday, April 18, 2024

కరోనా ట్రీట్మెంట్ ఫ్రీ అంటూ డబ్బా కొట్టాడు ఫేక్ సీఎం

కరోనాను కట్టడి చేయడంలో జగన్ సర్కార్ విఫలమైందటూ మరోసారి విరుచుకుపడ్డారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధ వెకంన్న. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌భుత్వ, ప్రైవేటు ఆసుప‌త్రుల్లో క‌రోనాకు ఉచితంగా చికిత్స అంటూ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ చెప్పిన ఓ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన బుద్ధా వెంక‌న్న.. దీనిపై విమ‌ర్శ‌లు గుప్పించారు.

‘ఇక్కడ ఏపీ ప్రజలకు అర్థం కాకూడదని, ఇంగ్లిష్ లో ఒక వీడియో చేసి, కరోనా ట్రీట్మెంట్ ఫ్రీ అంటూ డబ్బా కొట్టాడు, ఫేక్ సీఎం. అది పట్టుకుని, పేటీఎం పెద్ద కూలీలు రంగంలోకి దిగి, నేషనల్ వైడ్ డబ్బా కొట్టించారు. ఇవన్నీ తప్పుడు వార్తలు అంటూ అనేక ఫ్యాక్ట్ చెక్ వెబ్ సైట్లు కౌంటర్ ఇచ్చాయి. జగన్ రెడ్డి, నీకు దమ్ము ఉంటే, కరోనా ట్రీట్మెంట్ ఫ్రీ, ఒక్క పైసా అవసరం లేదని, ప్రతి హాస్పిటల్ ముందు, నీ సుందరమైన ముఖంతో, ఒక బ్యానర్ పెట్టించు. ఫేక్ ఫెలోస్ , ఫేక్ పార్టీ అనేది ఇందుకే’ ‘ అని బుద్ధా వెంక‌న్న విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement