Thursday, April 25, 2024

ఏపీలో జే ట్యాక్స్.. వైసీపీ నేతల బరితెగింపు: అచ్చెన్న

ఆంధ్రప్రదేశ్ లో జేఎంఎం ట్యాక్స్ కట్టి పనులు చేసుకోవాల్సి వస్తోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. జే ట్యాక్స్, మినిస్టర్ ట్యాక్స్, ఎమ్మెల్యే ట్యాక్స్ చెల్లిస్తేనే కాంట్రాక్టర్లను పనులు చేసుకోనిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర స్థాయిలో జేట్యాక్స్.. జిల్లా స్థాయిలో మినిస్టర్ ట్యాక్స్.. నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యే ట్యాక్సులు చెల్లిస్తేనే పనులు చేయనిస్తున్నారని ఆరోపించారు.

రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్ర రెడ్డి సన్నిహితుడు జయరామిరెడ్డి బరితెగింపులే ఇందుకు నిదర్శనమన్నారు. వారి చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. లిక్కర్, ఇసుక, మైనింగ్, రేషన్, పేకాట ద్వారా వచ్చే ఆదాయం సరిపోక ఇప్పుడు కాంట్రాక్టర్లపై పడ్డారని మండిపడ్డారు. రెండేళ్ల కాలంలో వందలాది మంది కాంట్రాక్టర్లు నాయకుల దోపిడీకి భయపడి పోయారన్నారు. జగన్నాద రథ చక్రాలొస్తున్నాయని ప్రజలకు చెప్పి.. వాహనాల చక్రాలు ఊడిపోయేలా పాలన చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వం తీరు ఇలాగే వుంటే..రహదారుల గోతుల్లో మిమ్మల్ని, మీపార్టీని ప్రజలు తొక్కేస్తారని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement