Friday, March 29, 2024

ఎన్నిక‌ల క‌మిష‌న్ పై తెలుగుదేశం గరం గ‌రం..

అమరావతి: వైసీపీ అరాచకాలకు ఎస్‌ఈసీ తలొగ్గినట్లు ఉందని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… మంత్రులు, నేతలపై నామమాత్రపు చర్యలే ఇందుకు నిదర్శనమని చెప్పారు. వైసీపీ నేతలపై ఏం చర్యలు తీసుకున్నారో డీజీపీ గౌతమ్ సవాంగ్ సమాధానం చెప్పాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు. జోగి రమేష్‌ ఆరేళ్లు ఏ ఎన్నికల్లో పోటీ చేయకుండా బహిష్కరించాలన్నారు. మంత్రులు బాలినేని, పెద్దిరెడ్డి, కొడాలి నానిపై… ఎస్‌ఈసీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని వర్ల రామయ్య ప్రశ్నించారు. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ నేతల అరాచకాలు పెరిగిపోయాయని వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement