Tuesday, April 23, 2024

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌లో టిడిపి జోరు – వైసిపికి షాక్

అమరావతి: ఏపీలో పట్టభద్రులు(గ్రాడ్యుయేట్‌) ఎన్నికల్లో టిడిపి ఆధిక్యంలో కొన‌సాగుతున్న‌ది.. మొత్తం మూడు స్థానాల‌లో ఓట్లు లెక్కింపు కొన‌సాగుతుండ‌గా రెండు చోట్ల టిడిపి సంపూర్ణ ఆధీక్యంలో ఉండ‌గా,మూడో స్థానంలో టిడిపి, వైసిపి మ‌ధ్య పోరు హోరాహోరిగా కొన‌సాగుతున్న‌ది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో 6దు రౌండ్లు పూర్తయ్యేసరికి తెదేపా అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు ముందంజలో ఉన్నారు. సమీప ప్రత్యర్థి, వైకాపా అభ్యర్థి సీతంరాజు సుధాకర్‌పై ఆయన 20,310 ఓట్ల భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
ఇప్పటివరకు తెదేపా అభ్యర్థికి 58,957, వైకాపా అభ్యర్థికి 38,647, పీడీఎఫ్‌ అభ్యర్థి రమాప్రభకు 23,575, భాజపా అభ్యర్థి పీవీఎన్‌ మాధవ్‌కు 6,928 ఓట్లు వచ్చాయి. మొత్తం 8 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగాల్సి ఉండగా.. ఇప్పటికి ఆరు రౌండ్లు పూర్తయ్యాయి. మరో రెండు రౌండ్లు ఇంకా లెక్కించాల్సి ఉంది.


ఇక తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ టిడిపి అభ్య‌ర్ధి తిరుగులేని ఆధీక్యంలో ఉన్నారు..ఇక్క‌డ 5 రౌండ్లు పూర్తయ్యేసరికి టిడిపి అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ 16 వేల‌ ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మూడు రౌండ్లలో శ్రీకాంత్‌కు 49,173 ఓట్లు రాగా.. వైకాపా అభ్యర్థి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డికి 39,615 ఓట్లు పడ్డాయి.

పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు రౌండ్లు పూర్తయ్యేసరికి వైకాపా అభ్యర్థి వెన్నపూస రవీంద్రరెడ్డి 1,943 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మూడు రౌండ్లలో రవీంద్రరెడ్డికి 28,872 ఓట్లు రాగా.. తెదేపా అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డికి 26,929 ఓట్లు పడ్డాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement