Thursday, April 25, 2024

Breaking: టీడీపీ అధినేత చంద్రబాబుకు కరోనా పాజిటివ్

తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకి కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. దీంతో ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఐసోలేషన్‌ లో ఉన్నారు.ఈ విషయాన్ని స్వయంగా చంద్రబాబు నాయుడు తన ట్విట్టర్‌ వేదికగా ప్రకటన చేశారు. ” నాకు తేలిక పాటి లక్షణాలతో కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. దీంతో నేను హోం ఐసోలేషన్‌ లో ఉన్నారు. వైద్యుల సూచలన మేరకు అన్ని నిబంధనలను పాటిస్తున్నారు. నాతో గత కొన్ని రోజులుగా సన్నిహితంగా ఉన్న వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలి. ” అని చంద్రబాబు పేర్కొన్నారు. కాగా నిన్నటి రోజునే చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌ కు కూడా కరోనా సోకిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement