Thursday, April 18, 2024

తార‌క‌ర‌త్న మృతి బాధాక‌రం.. చంద్ర‌బాబు

తార‌క‌ర‌త్న మృతి బాధాక‌ర‌మ‌ని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు అన్నారు. తారకరత్న భౌతికకాయానికి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నివాళులర్పించారు. సతీమణి భువనేశ్వరి, తనయుడు లోకేశ్‌తో కలిసి మోకిలలోని తారకరత్న నివాసానికి చేరుకుని అంజలి ఘటించారు. అనంతరం తారకరత్న కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈసంద‌ర్భంగా చంద్ర‌బాబు మాట్లాడుతూ… చిన్న వ‌య‌సులో తార‌క‌ర‌త్న చ‌నిపోవ‌డం చాలా బాధేస్తోందన్నారు. స‌మాజానికి ఏదో చేయాల‌న్న ఆసక్తి ఉన్న వ్య‌క్తి అన్నారు. ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌నే ఆలోచ‌న ఉంద‌ని చెప్పార‌న్నారు. కుటుంబ‌మంతా ఆవేద‌న‌తో ఉన్నామ‌న్నారు. తార‌క‌ర‌త్న ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని దేవున్ని ప్రార్థిస్తున్నాన‌న్నారు. తారకరత్న కుటుంబానికి అండగా ఉంటామని చంద్రబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement