Friday, April 19, 2024

Breaking: తారకరత్నకు గుండెపోటు.. నిర్ధారించిన వైద్యులు

టీడీపీ నేత నారా లోకేష్ ఈ ఉదయం పాదయాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఈ పాదయాత్రలో నడుస్తుండగా నటుడు తారకరత్న స్పృహ త‌ప్పిప‌డిపోయాడు. దీంతో హుటాహుటిన కార్య‌క‌ర్త‌లు తార‌క‌ర‌త్న‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అయితే తార‌క‌ర‌త్న‌కు గుండెపోటు వ‌చ్చింద‌ని వైద్యులు నిర్ధారించారు. ఆస్ప‌త్రిలో వైద్యులు ఆయ‌న‌కు యాంజియోగ్రామ్ చేశారు. గుండెకు వెళ్లే ర‌క్త‌నాళాల్లో బ్లాక్ ల‌ను గుర్తించారు. త‌దుప‌రి ట్రీట్ మెంట్ కొన‌సాగుతోంది. ప్ర‌స్తుతం తార‌క‌ర‌త్న ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌ని వైద్యులు చెప్పారు. తార‌క‌ర‌త్న‌కు ప్రాణాపాయం త‌ప్పింద‌ని వైద్యులు తెలిపారు. దీనిపై హిందూపురం ఎమ్మెల్యే బాల‌కృష్ణ ఆస్ప‌త్రికి వెళ్లి వైద్యుల‌తో మాట్లాడారు. మెరుగైన వైద్య చికిత్స కోసం తార‌క‌ర‌త్న‌కు తిరుప‌తి లేదా బెంగ‌ళూరుకు త‌ర‌లించే అవ‌కాశ‌ముంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement