Thursday, April 18, 2024

ఆర్టీఐ కమిషనర్‌, చీఫ్ కమిషనర్ల ప్రమాణ స్వీకారం..

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్ర సమాచార కమిషన్‌కు ముఖ్య సమాచార కమిషనర్‌గా నూతనంగా నియామకమైన ఆర్‌.మహబూబ్ బాషా, కమిషనర్‌గా పి.శామ్యూల్‌ జొనాతన్‌చే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్ట‌ర్ సమీర్‌ శర్మ ఇవ్వాల ప్రమాణం చేయించారు. బుధవారం అమరావతి సచివాలయం మొదటి బ్లాకు సీఎం సమావేశ మందిరంలో ఈ కార్యక్రమం జరిగింది. ముందుగా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ప్రవీణ్‌ కుమార్‌ స్వాగతం పలుకగా అనంతరం ఇరువురు కమిషనర్లచే సీఎస్ ప్రమాణం చేయించారు. అనంతరం ఇరువురు కమిషనర్లకు సీఎస్ సమీర్‌ శర్మ, స్పెషల్ సీఎస్ ప్రవీణ కుమార్‌ పుష్ప గుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement