Saturday, April 20, 2024

అర్చకుల వేతనాల కోసం రూ.120 కోట్లు.. స్వరూపానందేంద్ర హర్షం

ఏపీలో అర్చకుల వేతనాల కోసం బడ్జెట్ కేటాయింపులపై విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్పందించారు. అర్చకుల వేతనాల కోసం రూ. 120 కోట్లు కేటాయించడం హర్షణీయం అని స్వరూపానందేంద్ర అన్నారు. దశాబ్దాలుగా అర్చకుల వేతనాల గురించి పాలకులు పట్టించుకోలేదని చెప్పారు. జీతాలను పెంచి అర్చకుల జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం జగన్ అభినందనీయుడని పేర్కొన్నారు. రిషికేశ్ లో ఉన్న తాము ఈ వార్త విని ఆనందించినట్లు తెలిపారు. జగన్మోహన్ రెడ్డికి రాజశ్యామల అమ్మవారి ఆశీస్సులు పరిపూర్ణంగా ఉంటాయని స్వరూపానందేంద్ర పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement