Thursday, April 25, 2024

హిందూ సనాతన ధర్మాన్ని పరిరక్షించుకుందాం: స్వరూపానంద

హిందూ సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవడానికి విశాఖ శారదా పీఠం నిరంతరం కృషి చేస్తుందని పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి అన్నారు.  నాగుల చవితి పర్వదినం రోజున జన్మించిన స్వరూపానందేంద్రకు సోమవారం సింహాచలం దేవస్థానం ప్రత్యేక ఆహ్వానితులు.. జాతీయ జర్నలిస్టుల సంఘం నేతలు స్వరూపానందేంద్రను పీఠంలో కలిశారు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా స్వామీని ఘనంగా సత్కరించి సింహాద్రినాధుడు జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కూడా నడుం బిగించాల్సినసమయం ఆసన్నం అయిందనన్నారు. ఆ విషయంలో విశాఖ శారదా పీఠం ముందు వరుసలో ఉంటుందన్నారు. సింహాచలం దేవస్థానం అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేయాలని స్వామీజీ సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement