Saturday, April 20, 2024

ఏపీ సర్కార్ పిటిషన్ పై… తెలంగాణ, కేంద్రంకు సుప్రీంకోర్టు నోటీసులు

విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10 సంస్థలను తక్షణమే విభజించాలని ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు స్పందించింది. 2014లో ఏపీ విభజన సమయంలో పార్లమెంట్ లో ఏపీ పునర్విభజన చట్టం ఆమోదించారు. అందులో పేర్కొన్న విధంగా షెడ్యూల్ 9, 10 సంస్థల విభజన ఇప్పటికీ పూర్తి కాలేదు. దీంతో ఏపీ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. ఈ రెండు షడ్యూళ్లకు సంబంధించి దాదాపు 91 శాతం సంస్థలు తెలంగాణలోనే ఉన్నాయని ఏపీ ప్రభుత్వం సుప్రీంకి నివేదించింది. విభజన అంశంలో తెలంగాణ నుంచి సహకారం లేదని కోర్టుకు వివరించింది. దీంతో విభజన వ్యవహారం ఆలస్యం జరుగుతోందని పేర్కొంది. ఈ సంస్థలను వెంటనే చట్టం ప్రకారం విభజన జరిగేలా చర్యలు తీసుకోవాలని సుప్రీంను కేంద్రం కోరింది.

ఈ పిటిషన్ లో తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలకు దిమ్మతిరిగే షాక్ తగిలింది. తాజాగా తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ఉన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ప్రతివాదులుగా ఉన్న కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. షెడ్యూల్ 9, 10 లోని సంస్థలు 91% తెలంగాణలో ఉన్నాయని, ఆస్తుల విలువ రూ.1,42,601 కోట్లని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. ఈ అంశాలపై తెలంగాణ ప్రభుత్వం స్పందించకపోవడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనేనని సుప్రీంకోర్టు తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement