Thursday, March 28, 2024

నెల్లూరును ఆదుకోండి.. మోడీ, అమిత్‌ షాకు ఉప రాష్ట్రపతి వెంకయ్య ఫోన్‌..

నెల్లూరు, ప్రభన్యూస్ : భారీ వర్షాలకు నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాలు పూర్తిగా దెబ్బతిన్నాయని తక్షణమే వరద బాధితులను ఆదుకునేందుకు సాయం అందించాలని ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ప్రధాని నరేంద్రమోదీ, హోం శాఖ మంత్రి అమిత్‌ షాలకు ఫోన్‌ చేసి రాష్ట్ర పరిస్థితులను వివరించారు. విశాఖ పర్యటనలో ఉన్న ఉప రాష్ట్రపతి నెల్లూరుతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో సంభవించిన వరదలు, ఆయా ప్రాంతాల్లో జరిగిన నష్టాలు, తదితర అంశాలను ఆయన వారి దృష్టికి తీసుకువెళ్లారు. తక్షణమే నెల్లూరుకు ఆర్థిక సాయాన్ని అందించాలని కోరారు.

గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement