Tuesday, April 23, 2024

సూళ్లూరుపేట మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ సస్పెన్షన్

ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ట్యాంకర్లను నెల్లూరు జిల్లాలో పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్ చేయడంపై పలు మాధ్యమాల్లో వచ్చిన ఆరోపణలను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) తీవ్రంగా పరిగణించారు. ఈ ఆరోపణలకు ప్రధాన బాధ్యునిగా ప్రాథమిక విచారణలో గుర్తించిన సూళ్లూరుపేట మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ గోపినాయక్ ను విధుల నుండి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీచేశారు. గూడూరు ఆర్.టి.ఓ. మల్లికార్జున రెడ్డిని తక్షణమే హెడ్ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ అంశాన్ని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసేందుకు పశ్చిమగోదావరి జిల్లా డిప్యుటీ ట్రాన్సుపోర్టు కమిషనర్ సిరి ఆనంద్ ను దర్యాపు అధికారిగా నియమించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement