Thursday, April 25, 2024

Breaking: షార్ లో మరొకరి ఆత్మహత్య..

సూళ్లూరు పేట (రాయలసీమ ప్రభ వెబ్ న్యూస్) : శ్రీహరి కోట రాకెట్ ప్రయోగ కేంద్రం (షార్) ప్రాంగణంలో రెండురోజుల్లో మూడో ఆత్మహత్య కేసు నమోదైంది. సోమవారం రాత్రి విధినిర్వహణలో ఉన్న ఛత్తీస్ గఢ్ కు చెందిన చింతామణి అనే జవాన్ ఉరివేసుకుని మరణించగా.. అదే రోజు రాత్రి ఉత్తర ప్రదేశ్ కు చెందిన వికాస్ సింగ్ అనే సబ్ ఇన్స్పెక్టర్ తుపాకీతో కాల్చుకుని మరణించాడు.. కాగా నిన్న‌ రాత్రి వికాస్ సింగ్ భార్య ప్రియాసింగ్ (23) ఇంటిలోనే ఉరి వేసుకుని మరణించినట్టు పోలీసులు తెలిపారు.

వికాస్ సింగ్ మరణం గురించి తెలిసి ఉత్తరప్రదేశ్ నుంచి తన ముగ్గురు పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులతో వచ్చిన ప్రియా రోజాంతా ఏడుస్తూ ఉందని, రాత్రి అందరూ నిద్రపోయిన తరువాత గదిలో ఉరి వేసుకుని మరణించిందని పోలీసులు తెలిపారు. భర్త చనిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మ హత్యకు పాల్పడినట్టు భావిస్తూ.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. కాగా ప్రఖ్యాతి గాంచిన షార్ ప్రాంగణంలో రెండు రోజుల్లో ముగ్గురు ఆత్మహత్యలకు పాల్పడటం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement