Monday, April 15, 2024

కుటుంబ కలహాలతో ఆత్మహత్యాయత్నం..

చిలకలూరిపేట, (ప్రభ న్యూస్): కుటుంబ కలహాల నేపథ్యంలో అన్నదాసు సుబ్బారావు ఒంటిమీద కిరోసిన్ పోసుకొని నిప్పటించుకున్న సంఘటన చిలకలూరిపేట పట్టణంలో చోటుచేసుకుంది. 108 సిబ్బంది తెలిపిన వివరాలు ప్రకారం.. శుక్రవారం రాత్రి పట్టణంలోని గుండయ్య తోటలో సుబ్బారావు (40) కుటుంబం నివాసం ఉంటున్నారు. అయితే కుటుంబ కలహాల నేపథ్యంలో ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. 80% ఒళ్లంతా కాలిపోయింది.. సమాచారం అందుకున్న చిలకలూరిపేట 108 సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని ఈఎంటి శోభన్ బాబు, పైలట్ శివనాగం ఆంజనేయులు ఇతనికి ప్రథమ చికిత్స చేసి అనంతరం చిలకలూరిపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. వైద్యులు ట్రీట్మెంట్ చేసి గుంటూరు జీజీ హెచ్ కు రెఫర్ చేయడం జరిగింది. మరలా 108 అంబులెన్స్ లో గుంటూరు జీజీహెచ్ కు తరలించారు. అతనికి భార్య, ఇరువురు సంతానం.

Advertisement

తాజా వార్తలు

Advertisement