Tuesday, April 23, 2024

బస్సు నడుపుతుండగా స‌డెన్ స్ర్టోక్‌.. గుండెపోటుతో బస్సులోనే డ్రైవ‌ర్‌ మృతి

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలో విషాదం నెలకొంది. బస్సు నడుపుతూ ఆర్టీసీ డ్రైవర్ గుండెపోటుకు గుర‌య్యారు. మదనపల్లె నుంచి బ‌స్సు తిరుపతికి వెళ్తుండ‌గా ఈ ఘ‌ట‌న జ‌రిగింది. బస్సు నడుపుతుండగా రవి అనే ఆర్టీసీ డ్రైవర్‌ కు గుండెపోటు వచ్చింది. తీవ్ర గుండెపోటు రావడంతో అతను బస్సులోనే కుప్ప‌కూలాడు. వెంటనే స్పందించిన ఓ ప్రయాణికుడు బస్సును కంట్రోల్‌ చేశాడు. ఈ సమయంలో బస్సులో 69 మంది ప్రయాణికులున్నారు. పూతలపట్టు- నాయుడుపేట జాతీయ రహదారి అగరాల వద్ద ఈ ఘటన జ‌రిగింది. డ్రైవ‌ర్ మృతితో కుటుంబంతో అత‌ని కుటుంబం క‌న్నీరుమున్నీరవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement