Thursday, April 25, 2024

Flash: నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఆదివారం ఉదయం ఓ విద్యార్థిని ఆత్మ‌హ‌త్యకు య‌త్నించింది. హాస్టల్ భవనంపై నుండి దూకి ఆత్మహత్యాయ‌త్నం  చేసింది. ఈ సంఘటన సంచలనం కలిగించింది. క‌ళాశాల‌లో ఇంజనీరింగ్ విభాగంలో రెండో సంవ‌త్స‌రం చ‌దువుతున్న రాజమండ్రికు చెందిన మారడపు హారిక కెత్రీ బిల్డింగ్ మూడవ అంతస్తు నుండి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. పరిస్థితి విషమంగా ఉండటంతో త‌క్ష‌ణం ఆమెను విజయవాడకు  తర‌లించారు. ఈ ఘ‌ట‌న‌తో ట్రిపుల్ ఐటీ స్టూడెంట్స్ భయ భ్రాంతులకు గురవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement