Tuesday, April 23, 2024

Breaking: ఏపీలో చంద్ర‌బాబు కాన్వాయ్‌పై రాళ్ల‌దాడి.. చీఫ్ సెక్యూరిటీ ఆఫీస‌ర్‌కు గాయాలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో టీడీపీ అధినేత‌, మాజీ సీఎం చంద్ర‌బాబు ప‌ర్య‌టిస్తున్నారు. ఇవ్వాల (శుక్ర‌వారం) సాయంత్రం నందిగామ‌లో చంద్ర‌బాబు ర్యాలీ చేప‌ట్టారు. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు కాన్వాయ్‌పై రాళ్ల‌దాడి జ‌రిగింది. కొంత‌మంది గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు రాళ్లు రువ్వారు. కాగా, చంద్ర‌బాబు చీఫ్ సెక్యూరిటీ ఆఫీస‌ర్ తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. కాన్వాయ్‌పై రాళ్లు ప‌డడంతో సెక్యూరిటీ ఆఫీస‌ర్‌కు గాయాల‌య్యాయి. దీనిపై చంద్ర‌బాబు సీరియ‌స్ అయ్యారు. త‌మ‌కు సెక్యూరిటీ క్ప‌లించ‌డంలో ఏపీ ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌ని, పోలీసులు ప‌ట్ఇంచుకోవ‌డం లేద‌ని ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement