Saturday, April 20, 2024

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించాలి.. వైవీ సుబ్బారెడ్డి

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను ఎప్పటిలా వైభవంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు టీటీడీ పాలకమండలి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈరోజు టీటీడీ పాలకమండలి సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. రెండున్నరేళ్ల తరువాతసెప్టెంబర్ 27 నుండి అక్టోబర్ 5వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. ఆనందనిలయం బంగారు తాపడం పనులకు ఆగమ పండితుల సలహాల మేరకు మరో నెలలో నిర్ణయం తీసుకుంటామన్నారు. బాలాలయం చేయడం వీలుకాదు కాబట్టి, టెక్నాలజీని వినియోగించి తాపడం పనులు నిర్వహించడంపై పరిశీలన చేస్తున్నామన్నారు. తిరుమలలో అక్టోపస్ భవన నిర్మాణానికి రూ.7 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం అమలవుతున్న విధంగానేసర్వదర్శన విధానం కొనసాగుతుందన్నారు. ఎస్.ఎస్.డి టోకన్లు జారీ పునరుద్ధరణపై సాధ్యాసాధ్యాలు పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. జూలై 24 నుండి నెల్లూరు నగరంలో శ్రీవారి వైభవోత్సవాలు జరుగుతాయన్నారు.

రూ.2.07కోట్లతో నూతన పారువేటు మండపం నిర్మాణం, రూ.7.30 కోట్లతో ఎస్వీ గోశాలలో పశుగ్రాసం కొనుగోలుకు టెండర్ ఖరారు, అమరావతి శ్రీవారి ఆలయంలో పచ్చదనాన్ని పెంపొందించడానికి రూ.2.09 కోట్లు నిధులు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. బేడీ ఆంజనేయస్వామి మూలమూర్తికి ఉన్న రాగి కవచానికి బంగారు తాపడానికి రూ.18.75 లక్షలు మంజూరు, తిరుమలలోని ఎస్వీ పాఠశాలను సింఘానియా ఎడ్యుకేషన్ ముంబై ద్వారా మోడర్న్ స్కూల్ ను రూపొందించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 8 రకాల టీటీడీ క్యాలండర్ లు, డైరీలు ముద్రణకు టెండర్ ఆహ్వానం, రామానాథా గుహ అనే ఎన్ఆర్ఐ భక్తుడు బెంగళూరులోని రూ.3.20 కోట్లు విలువ చేసే అపార్ట్ మెంట్ విరాళం ఇచ్చినట్లు తెలిపారు. రూ.4.42 కోట్లతో తిరుపతిలో స్విమ్స్ ఆసుపత్రి ఐటి డెవలప్ మెంట్, శ్రీవారి ఆలయ పొటు మోడ్రనైజడ్ చేయాలని నిర్ణయించామన్నారు. ఆస్ట్రేలియా, స్విజర్లాండ్ కు చెందిమ కంపెనీల సహకారంతో మానవరహిత బుంది తయారీ విధానం పరిశీలన, ఏపీ మార్క్ ఫెడ్ ద్వారా 12 రకాల గో ఆథారిత వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలుకు నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement