Tuesday, April 23, 2024

అనుమానాస్పద స్థితిలో ఇద్దరు మృతి

ఇద్ద‌రు అనుమానాస్ప‌ద స్థితిలో మృతి చెందిన సంఘ‌ట‌న శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలో చోటుచేసుకుంది. దన్నానపేట గ్రామంలో ఒకే భవనంలో ఇద్దరు మృతి చెందారు. ఒక వ్యక్తి ఉరి వేసుకోగా.. మరో మహిళ మృతదేహం లభించింది. ఆమె మెడపై రక్తపు మరకలు ఉండడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరిద్దరిది హత్య లేదా ఆత్మహత్యా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధమే కారణమని స్థానికులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement