Wednesday, March 27, 2024

పోలీస్ స్టేష‌న్ లో లొంగిపోయిన టిడిపి నేత కూన ర‌వికుమార్

శ్రీకాకుళం: ఏడు రోజులుగా అజ్ఞాతంలో వున్న టీడీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌ గురువారం పొందూరు పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు. ఆయనను పోలీసులు రాజాం కోర్టుకు తరలించారు. రాజాం మండలం పొగిరి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో రవికుమార్‌కు వైద్యులు కరోనా వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం రాజాం కోర్టుకు తరలించారు. పరిషత్ ఎన్నికల పోలింగ్‌ రోజున పొందూరు మండలం పెనుబర్తి వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి ఇంటిపై అనుచరులతో కలిసి కూన రవికుమార్‌ దాడి చేసిన ఘటనలో ఆయనపై కేసు నమోదయ్యింది. దీంతో పోలీసులు తనను అరెస్టు చేస్తారనే భయంతో కూన ముందుగానే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు..నేడు ఆయ‌న పోలీస్ స్టేష‌న్ లో లొంగిపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement