Thursday, April 25, 2024

మట్టిలో కూరుకుపోయిన ఆక్సిజన్ ట్యాoకర్

ఇచ్ఛాపురం – 17 టన్నుల ఆక్షిజన్ తో హరియాణా లోని ఫరీదాబాద్ నుండి కోయంబత్తూరు వెళుతోన్న ట్యాoకర్ లారీ మట్టిలో కూరుకుపోయింది. గురువారం వేకువజామున లొద్దపుట్టి వద్ద జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న సిఐ వినోద్ బాబు కోవిడ్ రోగులకు అత్యవసరం కావడంతో వెంటనే స్పందించారు. పట్టణ ఎస్సై సత్యనారాయణ ద్వారా టోల్ ప్లాజా ని అప్రమత్తం చేశారు. క్రేన్ సాయం తో బయటకు తీయించారు. ఎక్కడా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఎస్కార్ట్ వాహనం సమకూర్చి జిల్లా దాటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement