Thursday, April 25, 2024

ఆపద్బాంధవుడు జగన్..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొనేందుకు సీఎం జగన్ వెళ్తుండగా.. ఆయనను చూసిన కొంతమంది కలవడానికి ప్రయత్నించారు. అంత రద్దీలోనూ వారిని గమనించిన జగన్.. ‘సభ దగ్గరకు తీసుకురండి.. నేను చూసుకుంటా’ అని సైగ చేశారు. సభా ప్రాంగణం వద్దకు చేరుకున్న వారిని గుర్తించిన జగన్ వారితో మాట్లాడారు. దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న చిన్నారిని పలకరించి భయపడొద్దని భరోసా ఇచ్చారు. తాను చూసుకుంటానని హామీ ఇచ్చారు. అక్కడే ఉన్న శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కు ఆ చికిత్స ఇండియాలోనే కాదు ప్రపంచంలో ఎక్కడున్నా అందించాలని, చిన్నారికి అవసరమైన ఆపరేషన్ చేయించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే అక్కడికక్కడే పదివేల రూపాయలు పెన్షన్ మంజూరు చేశారు సీఎం జగన్.

Advertisement

తాజా వార్తలు

Advertisement