Thursday, March 28, 2024

సమస్యల పరిష్కరిస్తా – ఛైర్ ప‌ర్స‌న్ రాజ్య‌ల‌క్ష్మి…

ఇచ్ఛాపురం – ‘గుడ్ మార్నింగ్ ఇచ్చాపురం’ కార్యక్రమంలో చైర్ పర్సన్ పిలక రాజ్యలక్ష్మి సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. గురువారం ఉదయం 6 గంటలు నుండి 8 గంటలు వరకు 18వ మరియు 19వ వార్డులలో ఆమె కమి‌షనర్ ఎల్. రామలక్ష్మి , కౌన్సిలర్లు చిడిపోతు జగన్నాయకులు , బొబ్బిలి భూదేవి, తాడి ఆదిరెడ్డి తో కలసి పర్యటించారు. ప్రతి వీధిలోని ఇంటింటికి స్వయంగా సమస్యలు అడిగి తెలుసుకుని,పరిష్కరం దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కొన్ని సమస్య పరిష్కారానికి సంబందించిన అధికారులకు వెంటనే చర్యలు తీసుకోమని ఆదేశించారు. కార్యక్రమంలో భాగంగా 18వ మరియు 19వ వార్డులకు సంబందించి రోడ్లు, కాలువలు, బోర్లు, పెన్షన్,రేషకార్డులు , హౌసింగ్ కు సంబందించిన సమస్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇతర విభాగ అధిపతులు, సచివాలయ సిబ్బంది , వాలేంటీర్లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement