Friday, March 29, 2024

Breaking : ఏసీబీకి చిక్కిన ఏఈ

రైతు నుంచి లంచం తీసుకుంటుండ‌గా ఏసీబీ అధికారులు వ‌ల‌ప‌న్ని ప‌ట్టుకున్నారు. వ్యవసాయ భూమికి విద్యుత్ కనెక్షన్ ఇప్పించేందుకు కిల్లిపాలెం గ్రామానికి చెందిన రైతు బీ.అప్పారావును ఏపీ ఈడీసీఎల్ ఆపరేషన్ సెక్షన్ శ్రీకాకుళం రూరల్ ఏఈ జి.వెంకటరమణ రూ.30 వేల లంచం అడిగాడు. దీంతో ఏం చేయాలో అర్ధం కాని ఆ రైతు ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. అధికారులు రంగంలోకి దిగారు. తాము చెప్పిన‌ట్లు చేయాల‌ని రైతుకు సూచించారు. బుధవారం మధ్యాహ్నం ఏఈ జి.వెంకటరమణ రైతు నుండి రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా శ్రీకాకుళం ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అరెస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement