Saturday, April 20, 2024

అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యం పట్టివేత 

శ్రీకాకుళం : అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వ‌హించి ప‌ట్టుకున్నారు. ప్రాంతీయ నిఘా అమలు అధికారి పి.వి.రవి కుమార్ ఆదేశాలు మేరకు టెక్కలిలో వాహన తనిఖీలు నిర్వ‌హించారు. విజిలెన్స్, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా 27 మెట్రిక్ టన్నుల పిడిఎస్ బియ్యంతో వెలుతున్న లారీని పట్టుకున్నారు. లారీలో ప్రయాణం చేస్తున్న భీమా సాహు, విష్ణుషాలను అదుపులోకి తీసుకుని ప్ర‌శ్నించారు. దీంతో సదరు బియ్యం టెక్కలి పట్టణానికి చెందిన బోయిన పవన్ కుమార్ ప్రజల వద్ద నుండి సేకరించార‌ని తెలిపారు. ఈ బియ్యాన్ని ఇచ్చాపురంకు చెందిన లోకండి గుణ అను వ్యక్తికి అమ్ముతున్నట్లు తెలిపారు. రూ.10,56,780/- విలువ‌గ‌ల పి‌డి‌ఎస్ బియ్యాన్ని, లారీని సీజ్ చేసి సంబంధిత అక్రమ రవాణా దారులపై కేసు నమోదు చేసారు. ఈ దాడిలో విజిలెన్స్ డివిజనల్ సుపరెంట్ ఆఫ్ పోలీస్ ఎస్ కిరణ్ కుమార్, సర్కిల్ ఇన్ స్పెక్ట‌ర్ సింహాచలం, సబ్ ఇన్ స్పెక్ట‌ర్ అశోక్, హెడ్ కానిస్టేబుల్ రామ్మోహన్ , టెక్కలి పౌర సర్ఫారాల ఉప తహశీల్దార్ గిరిబాబు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement