Wednesday, April 24, 2024

ఘోర రోడ్డు ప్రమాదం.. తొమ్మిది మందికి గాయాలు

శ్రీకాకుళం : పలాస మండలం నెమలి నారాయణపురం గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఆటోను కారు ఢీకొన్న ఘ‌ట‌న‌లో ఆటోలో ఉన్న ఎనిమిది మంది ప్రయాణికులతో పాటు ఆటో డ్రైవర్ కు తీవ్ర గాయాల‌య్యాయి. విషయం తెలుసుకున్న 1033 హైవే అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పలాస ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానంతరం ఆపకుండా అతివేగంగా వెళ్లిపోయిన కారును కంచిలి సమీపంలో పోలీసులు ప‌ట్టుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement