Wednesday, April 24, 2024

ప్రత్యేక హోదా తెస్తామన్నారు.. ఏమైంది… : చంద్రబాబు

ప్రత్యేక హోదా తెస్తామన్నారు వైసీపీ వాళ్లు.. ఏమైందని మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఒంగోలులోని మండువవారిపాలెంలో నిర్వహించిన టీడీపీ మహానాడులో చంద్రబాబు మాట్లాడుతూ…వైసీపీ అవినీతి వల్లే రాష్ట్రం దివాళా తీసిందన్నారు. సంక్షేమం లేదని.. అంతా మోసకారి సంక్షేమమేన్నారు. పోలవరంలో డయాఫ్రం వాల్ కొట్టుకుపోయే పరిస్థితి వచ్చిందన్నారు. పోలవరంలో ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొందన్నారు. 30లక్షల ఇళ్లని చెప్పిన మీరు కట్టింది మూడే ఇళ్లన్నారు. అడిగితే కేసులు పెడుతున్నారని.. మీ కేసులు మమ్మల్ని ఏమీ చేయలేవన్నారు. వర్షాకాలంలో రోడ్లపై చేపలు పట్టేలా రోడ్లపై నీళ్లు ఉంటున్నాయన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement