Thursday, April 18, 2024

ప్రత్యేక హోదా, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి కాంగ్రెస్ తోనే సాధ్యం.. జైరాం రమేష్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత జైరాం రమేష్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పెడితే ప్రజలు వీఆర్ఎస్ ఇస్తారన్నారు. జోడో యాత్రపై బీజేపీ విషం కక్కుతోందన్నారు. భారత్ జోడో యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీకి ప్రత్యేక హోదాపై తొలి సంతకం పెడతామన్నారు. ప్రత్యేక హోదాపై వైసీపీ, టీడీపీ గట్టిగా ప్రశ్నించలేకపోయాయన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement