Tuesday, March 26, 2024

Alert: ఏపీకి వెళ్తున్నారా ?.. 37 రైళ్లు రద్దు!

అసని తుఫాన్ నేపథ్యంలో రైల్వే శాఖ అప్రమత్తమైంది. ఆంధ్రప్రదేశ్‌లో తుఫాను దృష్ట్యా సికింద్రాబాద్‌ నుంచి ఏపీ వెళ్లే 37 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. ఇందులో విజయవాడ-మచిలీపట్నం, మచిలీపట్నం-విజయవాడ, విజయవాడ-నర్సాపూర్‌, నర్సాపూర్‌-విజయవాడ, నర్సాపూర్‌-నిడదవోలు, నిడదవోలు-నర్సాపూర్‌, భీమవరం జంక్షన్‌-నిడదవోలు, మచిలీపట్నం-విజయవాడ, విజయవాడ-భీమవరం జంక్షన్‌ మధ్య నడుస్తున్న రైళ్లను రద్దు చేశారు. మరికొన్ని రైళ్లను రీ-షెడ్యూల్‌ చేశారు. విశాఖపట్నం మీదుగా వెళ్లే రైళ్లన్నింటిని అధికారులు రద్దు చేశారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. ఇంకొన్ని రైళ్లను దారి మళ్లించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement