Friday, March 29, 2024

FLASH: అత్తను కొడవలితో నరికి చంపిన అల్లుడు

సత్యసాయి జిల్లా అమడగూరు మండలంలో దారుణం జరిగింది. అత్తను కొడవలితో నరికి చంపాడు అల్లుడు. లోకోజుపల్లి గ్రామంలో శనివారం రాత్రి చాకలి లక్ష్మీ దేవి 60 అనే మహిళను తన కూతురు భర్త చాకలి బాబు మచ్చు కొడవలితో అతి దారుణంగా నరికి హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. మృతురాలు లక్ష్మీదేవి కూతురుని తనకల్లు మండలం సుబ్బరాయునిపల్లి గ్రామానికి చెందిన బాబుతో వివహం జరిగింది. అయితే భార్య మీద అనుమానం పెంచుకున్నాడు. దీనికి కారణం తన అత్తే అని లోకుజుపల్లికి వచ్చి రాత్రి 8 గంటల సమయంలో లక్ష్మీదేవి ఇంట్లోనే మచ్చు కొడవలతో నరికాడు. హత్య అనంతరం బాబు కొడుకుకి ఫోన్ చేసి నేను మీ అవ్వను నరికేశాను ఎవరు లేరు వచ్చి చూసుకోండి అని చెప్పాడు. దీంతో అక్కడి వెళ్లగా రక్తపు మడుగులో అప్పటికే విగతజీవిగా పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలం వద్దకు చేరుకొని హత్య పై ఆరతీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడు బాబును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement