Friday, April 26, 2024

బీజేపీకి మాత్రమే రాజకీయ సిద్ధాంతాలు: సోము

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీకి తప్ప ఇంకెవరికి రాజకీయ సిద్ధాంతాలు లేవని ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. బద్వేల్ లో బీజేపీ విజయం కోసం అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. బద్వేల్ ఉపఎన్నికలో మిత్రపక్షం జనసేన పార్టీ పోటీ నుండి తప్పుకున్నా బీజేపీ పోటీ చేస్తుందని తెలిపారు. గత ఏడేళ్లుగా ప్రధాని మోడీ మాత్రమే ఏపీని అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. వేల కోట్లు ఖర్చు పెట్టి హైవే లు, ఫ్లై ఓవర్లు, ఎయిమ్స్ వంటివి కేంద్రమే రాష్ట్రంలో నిర్మాణం చేస్తుందని గుర్తు చేశారు. టిడ్కో ఇళ్ల కోసం కేంద్రం రూ. 5 వేల కోట్లు ఇచ్చిందన్న సోము.. రాష్ట్ర ప్రభుత్వం లబ్ది దారులకు ఎందుకు ఇవ్వడం లేదు ? అని ప్రశ్నించారు. బీజేపీ ప్రజల పార్టీ అని, ప్రజల సమస్యలను పరిష్కరించే పార్టీ అని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Huzurabad By Eelection: కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపైన‌ర్స్ వీరే..

Advertisement

తాజా వార్తలు

Advertisement