Wednesday, March 27, 2024

దారుణం: రొయ్యల చెరువు దగ్గర ఆరుగురు సజీవ దహనం..

గుంటూరు జిల్లా రేపల్లె మండలంలో ఘోరప్రమాదం చోటుచేసుకుంది. లంకెవానిదిబ్బలోని ఓ రొయ్యల చెరువు వద్ద కాపలాగా ఉన్న ఆరుగురు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతులందరూ కూడా ఒడిశాకు చెందిన వలస కూలీలుగా గుర్తించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాత్రివేళ విద్యుదాఘాతం కారణంగానే ఈ ఘటన జరిగి ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. అయితే విద్యుత్ అధికారులు మాత్రం వారి మరణానికి షార్ట్‌సర్క్యూట్ ఎంతమాత్రమూ కారణం కాదని చెబుతుండడం పలు అనుమానాలు రేకెత్తిస్తోంది. మరోవైపు, ఘటనా స్థలం వద్దకు మీడియాను అనుమతించడం లేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: వీడియో: దళితుల కాళ్లు మొక్కిన ఈటల.. !

Advertisement

తాజా వార్తలు

Advertisement