Thursday, April 25, 2024

ఏపీలో కాంగ్రెస్‌కు షాక్‌.. బీజేపీలో చేరిన ఇద్ద‌రు పీసీసీ లీడ‌ర్లు

తిరుపతి సిటీ, (ప్రభ న్యూస్): ఏపీలో కాంగ్రెస్ పార్టీ షాక్ వంటి వార్త ఇది.. ఆ పార్టీ పీసీసీ కార్యదర్శిగా ఉన్న డాక్టర్ పెనుబాల చంద్రశేఖర్, పీసీసీ ప్రధాన కార్యదర్శి నల్లoదుల మోహన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసి మంగళవారం బీజేపీలో చేరారు. ఇవ్వాల రాజమండ్రిలో బిజెపి నేత జేపీ నడ్డా స‌మ‌క్షంలో వారు కాషాయ కండువా క‌ప్పుకున్నారు. దేశాన్ని ప్రధాని మోదీ అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తున్నార‌ని, ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీజేపీలో చేరిన‌ట్టు వారు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement