Thursday, April 25, 2024

మానసిక వికలాంగురాలిపై లైంగిక దాడి..

మానసిక వికలాంగురాలిపై యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన చిత్తూరు నగరంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిత్తూరు మహిళా పోలీస్‌ స్టేషన్‌ సీఐ మురళీమోహన్‌ కథనం మేరకు.. చిత్తూరు కొండమిట్టలో నివాస ముంటున్న రిటైర్డ్‌కానిస్టేబుల్‌ జానకిరామ్‌ రెడ్డి కుమారుడు జయచంద్రారెడ్డి కేబుల్‌ ఆపరేటర్‌ వ్యాపారం చేస్తున్నాడు. అదే వీధిలో ఉంటున్న ఓ మానసిక వికలాం గులైన యువతని లోబరుచుకుని పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు.

ఆమె తల్లి, సోదరి కూడా మానసిక వికలాంగులు కావడంతో అతను ప్రతిరోజూ వారి ఇంటికెళ్లే వాడు. ఇటీవల ఆమె తీవ్ర కడుపునొప్పి, ఇతర సమస్యలతో బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం డాక్టర్‌ వద్దకు తీసుకెళ్లారు. పరీక్షించిన డాక్టర్‌ ఆమె గర్భందాల్చినట్లు తెలిపారు. ఆశ్చర్యపోయిన కుటుంబ సభ్యులు ఎలా జరిగింది అని ఆరా తీశారు. దీంతో ఆ యువతి జయ చంద్రారెడ్డి తరచూ తన వద్దకు వచ్చేవాడని చెప్పింది. బాధితురాలి కుటుంబ సభ్యులు చిత్తూరు మహిళా పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు బాధితు రాలిని వైద్య పరీక్షల నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement