Thursday, March 28, 2024

ఏపీలో 17,354 మందికి కరోనా పాజిటివ్

సెకండ్ వేవ్ లో కొత్త కేసుల సంఖ్య  రెట్టింపవుతోందే తప్ప తగ్గుముఖం పట్టడంలేదు. ఏపీలో గడచిన 24 గంటల్లో 86,494 కరోనా పరీక్షలు నిర్వహించగా 17,354 మందికి పాజిటివ్ అని తేలింది. చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో రెండు వేలకు పైగా కొత్త కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. మరికొన్ని జిల్లాల్లో వెయ్యికి పైగా పాజిటివ్ కేసులు గుర్తించారు. అదే సమయంలో రాష్ట్రంలో 8,468 మంది కరోనా నుంచి కోలుకోగా, 64 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 11,01,690కి చేరింది. ఓవరాల్ గా 9,70,718 మంది కోలుకోగా, ఇంకా 1,22,980 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తం మరణాల సంఖ్య 7,992కి పెరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement