Saturday, April 20, 2024

Delhi: ఏపీ హైకోర్టులో ఏడుగురు కొత్త జడ్జిలు.. జ్యుడీషియల్ అధికారులకు పదోన్నతి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో ఏడుగురు జ్యుడీషియల్ అధికారులకు జడ్జిలుగా పదోన్నతి లభించింది. బుధవారం భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం సమావేశమై ఆమోదం తెలిపింది. ఈ సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించి, రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో ప్రక్రియ పూర్తవుతుంది. జడ్జిలుగా పదోన్నతి పొందినవారి జాబితా..

  1. అడుసుమిల్లి వెంకట రవీంద్ర బాబు
  2. వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్
  3. శ్యాంసుందర్ బండారు
  4. శ్రీనివాస్ వూటుకూరు
  5. బొప్పన వరాహ లక్ష్మీనరసింహ చక్రవర్తి
  6. తల్లాప్రగడ మల్లికార్జున రావు
  7. దుప్పల వెంకట రమణ

Advertisement

తాజా వార్తలు

Advertisement