Thursday, April 25, 2024

షార్ లో సెక్యూరిటీ జవాను ఆత్మహత్య.. కుటుంబ క‌ల‌హాలే కార‌ణ‌మా?

సూళ్లూరుపేట (రాయలసీమ ప్రభ వెబ్ pratinidhi) : తిరుపతి జిల్లా పరిధిలోని శ్రీహరి కోట రాకెట్ ప్రయోగ కేంద్రం (షార్ )లో రక్షణ విభాగం లో పనిచేస్తున్న గార్డు చింతామణి (28) ఆత్మహత్య కు పాల్పడిన ఘటన సోమవారం జరిగింది. పోలీసుల కధనం ప్రకారం చింతామణి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీ ఐ ఎస్ ఎఫ్ ) లో గార్డు ఈ నెల 10వ తేదీన డ్యూటీ లో చేరాడు. పండగకు ఇంటికీవెల్లి వచ్చిన చింతామణి శ్రీహరి కోట లోని రాడార్ సెంటర్ లో చెట్టుకి ఉరివేసుకుని మృతి చెందాడు. కుటుంబ పరమైన సమస్యల కారణంగానే మరణించి ఉంటాడని భావిస్తున్నామని ఘటనా స్ధలాన్ని పరిశీలించి మృతదేహాన్ని సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement