Thursday, March 28, 2024

విశాఖ‌లో రెండో వ‌న్డే మ్యాచ్.. టిక్కెట్ల కోసం బారులు తీరిన జ‌నం

టీమిండియా..ఆస్ట్రేలియా మ‌ధ్య 17వ తేదీ నుంచి వన్డే సమరం మొదలు కానుంది. తొలి వన్డే 17న ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది. ఇక రెండో వన్డే మాత్రం 19న విశాఖలో జరగనుంది. ఈ మ్యాచ్ టికెట్లను ఈనెల 10 నుంచే ఆన్ లైన్ లో అమ్ముతున్నారు. ఈరోజు నుంచి ఆఫ్ లైన్ లో అమ్ముతున్నారు. విశాఖలోని పీఎంపాలెం క్రికెట్ స్టేడియం బీ గ్రౌండ్, జీవీఎంసీ మున్సిపల్ స్టేడియం, రాజీవ్ గాంధీ క్రీడా ప్రాంగణం వద్ద టికెట్ విక్రయాలు జరుగుతున్నాయి. కౌంటర్ల వద్ద ఈ రోజు వేకువజాము నుంచే జనం బారులుతీరారు. వందల మంది క్యూ కట్టారు. కొందరు మహిళలు చిన్న పిల్లల్ని చంకనేసుకుని లైన్ లో నిలబడటం గమనార్హం. తోపులాట జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు.ఇప్పుడీ ఫొటోలు వైర‌ల్ గా మారాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement