Thursday, April 25, 2024

చిత్తూరులో విద్యాసంస్థలకు సెలవు

వాయుగుండం ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలకు చిత్తూరు జిల్లా ప్రజలు వణికిపోతున్నారు. చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు ప్రాంతాలు నీటమునిగి చెరువులను తలపిస్తున్నాయి.

ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వర్షాల నేపథ్యంలో ఈ రోజు విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement