Tuesday, March 26, 2024

ఏపీలో నేటి నుంచి స్కూల్స్ పున:ప్రారంభం..

ఏపీలో ఎట్టకేలకు నేటి నుంచి పాఠశాలలు ప్రారంభమవుతున్నాయి. కరోనా సెకండ్ వేల్ మందగించడంతో పాఠశాలలు ప్రారంభిస్తున్నట్లు తెలిపింది విద్యాశాఖ. కగా కరోనా నేపథ్యంలో తగు జాత్రత్తలు తీసుకుంటూ తరగతులు నిర్వహించనుంది. తరగతుల నిర్వహణపై ఇప్పటికే విద్యాశాఖ పలు సూచనలు, మార్గదర్శకాలను విడుదల చేసింది. తరగతి గదికి 20 మంది విద్యార్థులు మించకుండా చర్యలు తీసుకోవాలంది. స్థానిక పరిస్థితుల ఆధారంగా ప్రతి స్కూల్‌కి ఎస్‌వోపీ ఉండాలని తెలిపింది. విద్యార్థుల సంఖ్య ఆధారంగా రోజు విడిచి రోజు తరగతులను నిర్వహించాలంది సర్కార్‌. నాడు-నేడు కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల దశ, దిశ సమూలంగా మారిపోగా.. సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్న పాఠశాలలు విద్యార్థులకు స్వాగత పలకనున్నాయి.

ఇది కూడా చదవండి: ఏపీకి రానున్న స్పీకర్ ఓం బిర్లా

Advertisement

తాజా వార్తలు

Advertisement