Thursday, April 18, 2024

సీఎం జ‌గ‌న్ నివాసంలో సంక్రాంతి సంబ‌రాలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తాడేప‌ల్లిలోని నివాసంలో సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. సీఎం దంపతులు ముందుగా జ్యోతిని వెలిగించి సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. అనంతరం గోశాలలో సీఎం జగన్ దంపతులు గోపూజ చేశారు. ఆపై భోగి మంటను వెలిగించిన సీఎం జగన్, హరిదాసు కీర్తనలు ఆలకించి ఆశీర్వాదం తీసుకున్నారు. రైతులు, పల్లె ప్రజలతో కలిసి ఏటా సంక్రాంతి వేడుకలు నిర్వహించుకోవడం సీఎం జగన్ కు ఆనవాయితీగా వస్తోంది. ఈసారి కూడా సాంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిప‌డేలా వేడుకలు నిర్వహిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement