Saturday, March 23, 2024

ఏపీ కొత్త సీఎస్ గా సమీర్ శర్మ

ఆంధ్రప్రదేశ్‌ కొత్త సీఎస్‌గా సమీర్‌ శర్మ నియమితులయ్యారు. అక్టోబర్‌ 1 నుంచి ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్‌ నూతన ప్రధాన కార్యదర్శి(సీఎస్‌)గా సమీర్‌ శర్మ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్‌ 1 నుంచి ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. 1985 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ సమీర్‌ శర్మ.. ఉమ్మడి ఏపీలో ఆప్కో, ఐటీడీసీ సీఎండీగా పనిచేశారు. ప్రస్తుతం ప్రణాళిక విభాగం స్పెషల్ చీఫ్ సెక్రటరీగా డాక్టర్ సమీర్ శర్మ ఉన్నారు. ఇప్పటికే మూడు నెలల ఎక్స్ టెన్షన్‌లో ఆదిత్యనాథ్ దాస్ ఉన్నారు. ఈ నెల 30న ఆదిత్యనాథ్‌ దాస్‌ పదవీ విరమణ చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement