Saturday, April 20, 2024

కుప్పంలో టీడీపీ బోర్లా.. వైసీపీ పాలనకు నిదర్శనం

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు సీఎం జగన్ సంక్షేమ పాలనకు నిదర్శనమని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పరిషత్‌ ఫలితాలతో ప్రభుత్వంపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. 98 శాతానికిపైగా స్థానాల్లో వైసీపీ గెలుపొందిందని తెలిపారు. సీఎం జగన్‌ పాలను ప్రజలు విశ్వసించబట్టే ఈ ఫలితాలు వచ్చాయన్నారు. పదవుల్లో అని వర్గాల వారికి సమాన ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. పార్టీతోపాటు నేతలంగా క్రమశిక్షణగా ఉన్నారన్నారు. జడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి 69.55 శాతం ఓట్లు వచ్చాయన్న సజ్జల… ఎంపీటీసీ ఎన్నికల్లో వైసీపీకి 64.8 శాతం ఓట్లు వచ్చాయని తెలిపారు. టీడీపీ తప్పుడు ప్రచారాలను ప్రజలు పట్టించుకోవడం లేదని, చంద్రబాబు కుట్రలను ప్రజలు నమ్మడం లేదన్నారు. కుప్పంలోనే టీడీపీ బోర్లా పడిందని అన్నారు. కుప్పం ఓటర్లు కూడా చంద్రబాబును విశ్వసించడం లేదని సజ్జల దుయ్యబట్టారు.

ఇది కూడా చదవండి: ఏపీని వదిలేసి తెలంగాణకు వస్తా: ఏపీ టీడీపీ నేత జేసీ

Advertisement

తాజా వార్తలు

Advertisement