Friday, April 19, 2024

ఎన్నికల కోసం డ్రామాలు వద్దు

కేంద్ర ప్రభుత్వం కేవలం ఎన్నికల కోసమే రాజకీయ డ్రామాలకు తెర తీసిందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజానాథ్ ధ్వజమెత్తారు. రైతుల చావులకు కారణమైన నరేంద్ర మోడీ పరిపాలనను వ్యతిరేకిస్తూ ప్రధాని కాన్వాయిని అడ్డగిస్తే పంజాబ్ ముఖ్యమంత్రి దిష్టి బొమ్మను బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు నేతృత్వంలో గురువారం విజయవాడలో దగ్ధం చేయడం  శోచనీయమన్నారు. బీజేపీ నాయకులపై రాష్ట్రానికి అంత ప్రేమ ఉంటే ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాలను రాష్ట్రానికి తీసుకువచ్చి ప్రత్యేక హోదా ఇప్పించాలని డిమాండ్ చేశారు.

అలాగే, రైల్వే జోన్ ఇప్పించాలని, రాష్టానికి రావాల్సిన పోలవరం నిధులతో పాటు రాయలసీమ, ఉత్తరాంధ్రకి రావాల్సిన ప్యాకేజీలను ఇప్పించాలని డిమాండ్ చేశారు. RSS భావజాలం నుంచి బీజేపీ నాయకులు బయటకు వచ్చి రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచిస్తే ప్రయోజనం ఉంటుందని శైలజానాథ్ హితవు పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement