Saturday, April 20, 2024

కల్వర్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. 11మందికి గాయాలు

తిరుపతి సిటీ ( ప్రభ న్యూస్): కృష్ణ‌గిరి నుండి తిరుమ‌ల‌కు వ‌స్తున్న ఆర్టీసీ బ‌సు క‌ల్వ‌ర్టును ఢీ కొంది. బ‌స్సు డ్రైవ‌ర్ నిద్ర‌మ‌త్తులో ఉండ‌టంతో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో 11మందికి గాయాలు అయ్యాయి. క్ష‌త‌గాత్రుల‌కి చికిత్స నిమిత్తం వారిని రుయూ హాస్ప‌ట‌ల్ కి త‌ర‌లించారు. ఈ సంఘ‌ట‌న తిరుపతి రూరల్ మండలం వకులామాత ఆలయం సమీపంలో చోటు చేసుకుంది. ఘ‌ట‌నాస్థ‌లికి పోలీసులు చేరుకుని కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement